
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కార్పొరేట్సామాజిక బాధ్యతలో భాగంగా పలు గొత్తికోయ గ్రామాలకు సింగరేణి ఆధ్వర్యంలో సోలార్ లైట్లను పంపిణీ చేశామని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని పాలవాగు, గడ్డిగుట్ట, జగ్గారం, మర్రిగూడెం గ్రామాల్లో ఎల్ఈడీ సోలార్ లైట్లను రుద్రంపూర్లోని జీఎం ఆఫీస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన పంపిణీ చేశారు.