అబూజ్మాఢ్ ఎన్కౌంటర్లో .. ఆరుగురు మావోయిస్టులు మృతి

అబూజ్మాఢ్ ఎన్కౌంటర్లో .. ఆరుగురు మావోయిస్టులు మృతి
  • మృతుల్లో నలుగురు మహిళలు

భద్రాచలం, వెలుగు: ఆపరేషన్​ మాన్​సూన్​లో భాగంగా శుక్రవారం ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని నారాయణ్​పూర్​ జిల్లా అబూజ్​మాఢ్​ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. పరియా-కాకూర్​ అటవీ ప్రాంతంలో జరిగిన కూంబింగ్​ ఆపరేషన్​లో నారాయణ్​పూర్, కాంకేర్, బస్తర్, కొండగావ్​ జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్​ బలగాలు పాల్గొన్నట్లు బస్తర్​ రేంజ్  ఐజీ సుందర్​రాజు పి, కాంకేర్​  రేంజ్​ డీఐజీ అమిత్​ తుకారం కాంబ్లే, నారాయణ్​పూర్​ ఎస్పీ రాబిన్సన్​  గురియా తెలిపారు. ఎన్​కౌంటర్​లో నలుగురు మహిళలతో సహా ఆరురుగు పీఎల్జీఏ ప్లాటూన్​ నంబర్–1 దళానికి చెందిన నక్సల్స్ చనిపోయినట్లు వెల్లడించారు.

మృతులపై రూ.48 లక్షల రివార్డు ఉందని తెలిపారు. పీఎల్జీఏ నంబర్  వన్​ ప్లాటూన్​ కమాండర్​ రాహుల్​ పూనెం(38), దళ సభ్యులు ఉంగీ తాతా(24), మనీషా(25), తాతీమీనా అలియాస్  సోమారీ అలియాస్​ చోటీ(22), హరీశ్  అలియాస్  కోసా(25), కుడాం​ అలియాస్  బుద్రీ(21)గా గుర్తించారు. ఘటనా స్థలంలో ఏకె-47, ఎస్ఎల్ఆర్, 12 బోర్​ తుపాకీ, 11 బీజీఎల్​ లాంచర్లు, 83 బీజీఎల్​ సెల్స్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అబూజ్​మాడ్​ అటవీ ప్రాంతంలో, వర్షంలో గుట్టలు, వాగులు దాటి వెళ్లి కూంబింగ్​ నిర్వహించిన భద్రతాబలగాలను ఐజీ అభినందించారు.