నిజామాబాద్ మోడల్ కాలేజీలో ఫుడ్పాయిజన్

 నిజామాబాద్ మోడల్ కాలేజీలో ఫుడ్పాయిజన్
  • వర్ని హాస్పిటల్​లో స్టూడెంట్స్​కు చికిత్స 

వర్ని, వెలుగు : నిజామాబాద్​ జిల్లా రుద్రూర్ మండలం అంబం శివారులోని మోడల్ కళాశాల హాస్టల్​లో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్​తో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించగా, చికిత్స పొందుతున్నారు. మోడల్​ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్​ఎం ప్రణవి నిర్లక్ష్యం వల్ల  విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు.

 భోజనానికి ముందు విద్యార్థులకు ఐరన్ మాత్రలు వేశారని, ఉడికీఉడకని అన్నం తినడం వల్ల  అస్వస్థతకు గురయ్యారని వారు ఆరోపించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడిందని హాస్పిటల్​ నుంచి డిశ్చార్జి అయి కళాశాలకు వచ్చారని ప్రిన్సిపాల్​ చెన్నప్ప తెలిపారు.