ఈ జనరేషన్‌‌కి కనెక్ట్ అయ్యేలా..‘స్లమ్ డాగ్ హస్బెండ్

ఈ జనరేషన్‌‌కి కనెక్ట్ అయ్యేలా..‘స్లమ్ డాగ్ హస్బెండ్

‘పిట్ట కథ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన మరో సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్.  ఏ ఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జులై 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ‘‘పిట్ట కథ’ తర్వాత  డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నా. డైరెక్టర్ ఈ కథ చెబుతున్నప్పుడే నవ్వు ఆగలేదు. ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది. నేను డాగ్ లవర్ కావడంతో షూటింగ్‌‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశా. అలాగే హీరోయిన్  ప్రణవిది చాలా ముఖ్యమైన పాత్ర.  ఇందులో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. జనరల్‌‌గా రాత్రి పూట బాయ్‌‌ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకునేదే ఉంటుంది.

ALSO READ :అనుదీప్ కోసం మూడు ఆప్షన్స్.. లిస్టులో స్టార్ హీరో కూడా!

 ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతుంది. సెట్స్‌‌లో మా నాన్నను ఓ నటుడిగానే చూస్తా. కో యాక్టర్‌‌గానే కలిసి నటిస్తా. ‘పుష్ప2’ షూటింగ్‌‌లో అల్లు అర్జున్ గారు నాన్నతో మాట్లాడారు. ‘బ్రహ్మాజీ.. మీ కొడుకు సినిమా ట్రైలర్ అదిరిపోయింది’ అని చెప్పడం ఆనందంగా అనిపించింది. మా నాన్న తర్వాత.. బన్నీ గారిని చూసే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ప్రస్తుతం  హీరోగా రెండు సినిమాలు చేస్తున్నా.  ఒక సినిమా షూట్ స్టార్ట్ అయింది. యాక్టర్‌‌గా ప్రూవ్‌‌ చేసుకోవాలని ఉంది. తమిళంలో శింబు హీరోగా నటిస్తున్న చిత్రంలో  విలన్‌‌గా నటిస్తున్నా’ అని చెప్పాడు.