యువకుడిపై కత్తులతో అటాక్

యువకుడిపై కత్తులతో అటాక్
  • వేశ్యతో గొడవ పడ్డందుకు ఆమె గ్యాంగ్​ దాడి
  • అరెస్టు చేసి రిమాండ్​కు పంపిన పోలీసులు

కూకట్​పల్లి, వెలుగు: సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​పై ఓ గ్యాంగ్​ కత్తులతో దాడి చేసిన ఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. రోడ్డు పక్కన నిల్చున్న వేశ్యతో బేరం కుదుర్చుకునే క్రమంలో తలెత్తిన వివాదం ఈ దాడికి దారితీసింది. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పని చేస్తున్న మధుగౌడ్​(28) సోమవారం రాత్రి కేపీహెచ్​బీ కాలనీ ఒకటో రోడ్డు గాంధీ విగ్రహం వద్ద నిల్చున్న రవళితో బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రవళి తన సోదరుడు సోహైల్​కు ఫోన్​ చేయడంతో అతను తన గ్యాంగ్​తో వచ్చాడు. 

వారంతా మధుగౌడ్​పై కత్తులతో దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రవళి, సోహైల్​తో పాటు సాయికుమార్​, సిసిందర్​రెడ్డి, ప్రతాప్​రెడ్డి, అశ్వనీకుమార్​సింగ్​, షేక్​ షరీఫ్​లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.