సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
  • ఎస్పీ రాజేశ్​చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : సైబర్​ నేరాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ రాజేశ్​ చంద్ర అన్నారు. గురువారం జిల్లాలో సైబర్ వారియర్స్​గా విధులు నిర్వహిస్తున్న వారికి  తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో వారు సప్లయ్​ చేసిన టీ షర్టులను  పంపిణీ చేసి మాట్లాడారు. డిజిటల్​ యుగంలో సైబర్​ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయన్నారు.  సైబర్​ నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి కేసును సీరియస్​గా తీసుకోవాలన్నారు. 

 బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సైబర్​ నేరాల్లో గోల్డెన్​ అవర్ ఎంతో కీలకమన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, లింకులు, అప్లికేషన్లు వినియోగించటం, చెప్పటం చేయవద్దన్నారు.   సోషల్ మీడియా ప్రకటనలపై ప్రజలు అలర్టుగా ఉండాలన్నారు.   ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​రావు,  సైబర్​ క్రైమ్​ జిల్లా నోడల్ అధికారి టి.శ్రీధర్  తదితరులు పాల్గొన్నారు.