నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని

నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని

మెదక్ టౌన్, వెలుగు : పోలీసులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై పూర్తి నిఘా ఉంచాలన్నారు. రౌడీ షీటర్లను, అనుమానితులను,  బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మహేందర్, మెదక్​, తూప్రాన్​ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరిరెడ్డి, డీసీఆర్​బీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్​ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Also Read :విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

సాఫ్ట్​స్కిల్​ డెవలప్​మెంట్​పై వర్క్​షాప్​

పోలీసులకు సాఫ్ట్​స్కిల్​ డెవలప్​మెంట్​పై అవగాహన అవసరమని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జిల్లా పోలీస్​ కార్యాలయంలో అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐజీపీ  ఆనంద్  వర్ధన్ శుక్ల మాట్లాడుతూ... ప్రతి పోలీస్ అధికారి ప్రజల సమస్యలను ఓర్పుగా వినడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్​ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరిరెడ్డి, డీసీఆర్​బీ డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్​చంద్రబోస్,  సీఐలు,  ఎస్‌ఐలు పాల్గొన్నారు.