
తేజాస్ ఎక్స్ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) నడుపుతున్న తేజాస్ రైలు 2019 అక్టోబరులో ప్రారంభమైంది. తర్వాత కరోనా కారణంగా ఇన్నాళ్లు రద్దయింది. తిరిగి ఇవాళ(శనివారం) పున: ప్రారంభమయింది. అహ్మదాబాద్-ముంబై,లక్నో-న్యూఢిల్లీల మధ్య తేజాస్ రైలు రాకపోకలు సాగించనుంది. అత్యంత వేగంగా నడిచే ఈ రైలు ప్రయాణికులకు ఉచితంగా రూ.25 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. 78 సీట్ల సామర్ధ్యం ఉన్న ఏసీ ఛైర్ కార్ బోగీలో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తారు. ఈ రైలులో ఆర్వో వాటర్ ఫిల్టరుతో పాటు ప్యాకేజేడ్ వాటర్ బాటిళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు.