వికారాబాద్, వెలుగు: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు పథకం కింద 2025 సీజన్కు సంబంధించి విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్/పీహెచ్డీ చదువుతున్న మైనారిటీ విద్యార్థుల (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి ఎస్. రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో జనవరి 19 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీ, అవసరమైన ధ్రువపత్రాలను జనవరి 20 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి ఇవ్వాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్షిప్, రూ.60 వేల వన్-వే విమాన చార్జీని ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వివరాలకు 7993357103, 9912144364 నంబర్లని సంప్రదించాలన్నారు.
