బెజవాడ దుర్గమ్మ సేవలో తెలంగాణ గవర్నర్ తమిళి సై

బెజవాడ దుర్గమ్మ సేవలో తెలంగాణ గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.  బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు.  ఇంద్రకీలాద్రికి చేరుకున్న గవర్నర్‌ తమిళసైకు దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తమిళసైకి పండితులు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఇచ్చారు. చంద్రయాన్- 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని, ఆదిత్య-ఎల్‌ 1 విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళసై తెలిపారు.