
- విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు
- ఆరుగురు డాక్టర్లు, ఇద్దరు చొప్పున సైకాలజిస్టులు, ఫుడ్ హైజీనిస్టులు, నలుగురు టెలి కౌన్సిలర్లు నియామకం
- ఉదయం, రాత్రి రెండు షిఫ్టుల్లో డ్యూటీలు
- నెల రోజుల్లో 4 వేల మందికి ఆన్లైన్లో వైద్య సేవలు
- మిగిలిన గురుకులాలతో పోలిస్తే తగ్గిన సమస్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 205 మైనారిటీ గురుకులాల్లో 24 గంటల పాటు మెడికల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నాంపల్లిలోని హెడ్ ఆఫీసులో హెల్త్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆరుగురు డాక్టర్లు, ఇద్దరు సైకాలజిస్టులు, ఇద్దరు ఫుడ్ హైజీనిస్టులు, నలుగురు టెలి కౌన్సిలర్లు విధులు నిర్వహిస్తున్నారు. పొద్దున, రాత్రి వేళల్లో రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు.
మైనారిటీ రెసిడెన్షియల్స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే స్టూడెంట్లకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన నెల రోజుల్లో 4 వేల మందికి పైగా విద్యార్థులకు వైద్య సేవలందించారు. దీంతో మిగిలిన గురుకులాలతో పోలిస్తే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో సమస్యలు తగ్గిపోయాయి.
ప్రతిరోజు పర్యవేక్షణ..
రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలతో పాటు టీఎస్ఆర్ఎస్రెసిడెన్షియల్స్కూల్స్, కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో ఐదో తరగతి నుంచి ఇంటర్వరకు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
గురుకులాల్లో కొన్ని చోట్ల పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, కుకింగ్, డైనింగ్ఏరియాలో క్లీనింగ్లేకపోవడం వంటి సమస్యలతో స్టూడెంట్స్కు హెల్త్ఇష్యూస్వస్తున్నాయి. అలాగే ఫుడ్పాయిజన్సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. కొందరు స్టూడెంట్స్ సైకలాజికల్సమస్యలతో బాధపడుతూ చదువు మానేయడం, స్కూల్స్ వదిలివెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను గుర్తించిన మైనారిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు హెల్పింగ్హ్యాండ్ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్హెడ్ఆఫీసులో హెల్త్ మానిటరింగ్కమాండ్సెంటర్ ఏర్పాటు చేశారు. పోలీస్కమాండ్కంట్రోల్ మాదిరిగా 24/7 మెడికల్ మానిటరింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 8 డెస్క్లు ఏర్పాటు చేసి కంప్యూటర్లు అమర్చారు.
అలాగే అక్కడ పని చేసే సిబ్బంది అందరికీ కనిపించేలా 75 ఇంచుల టీవీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతిరోజు స్టూడెంట్లకు సంబంధించిన డైలీ హెల్త్ఇష్యూస్పై డాష్బోర్డు మెయింటెయిన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ వైరల్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియాతో బాధపడే స్టూడెంట్స్ఎందరున్నారు? దగ్గు, దమ్ముతో బాధపడేవాళ్లు, ఈఎన్టీ, జనరల్, గైనిక్, ట్రామా, మైనర్ఇంజ్యూరిస్, చర్మ వ్యాధులు, ఫుడ్పాయిజన్ కేసులు ఎన్ని ఉన్నాయి? హాస్పిటల్స్లో అడ్మిట్ అయినవాళ్లు ఎందరు? అనే దానిపై రోజువారీగా సమీక్షిస్తున్నారు.
ఆన్లైన్లో వైద్య సేవలు..
హైదరాబాద్లోని హెల్త్ కమాండ్సెంటర్ సిబ్బంది ఇక్కడి నుంచే స్టూడెంట్లకు 24 గంటల పాటు ఆన్లైన్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా వారానికి రెండుసార్లు జూమ్మీటింగ్స్నిర్వహిస్తున్నారు. ఒకే స్కూల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్అనారోగ్యానికి గురైతే, అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడైనా సరే విద్యార్థులకు జ్వరం లేదా ఏ ఇతర హెల్త్ఇష్యూస్వచ్చినా.. ఆ స్కూల్లో పనిచేసే స్టాఫ్నర్స్బాధిత స్టూడెంట్వివరాలను కమాండ్కంట్రోల్ సెంటర్లో డ్యూటీలో ఉండే డాక్టర్కు షేర్ చేస్తుంది. అవసరమైతే అక్కడి నుంచే వాట్సప్వీడియో కాల్చేసి డాక్టర్తో స్టూడెంట్ను మాట్లాడిస్తారు. దీంతో బాధిత విద్యార్థి అవస్థలు డాక్టర్ తెలుసుకుని ఏయే మెడిసిన్, ఎప్పుడెప్పుడు వాడాలో నర్స్కు తెలియచేస్తారు.
ఒకవేళ స్టూడెంట్హెల్త్ఇష్యూ మరీ సీరియస్గా ఉంటే దగ్గర్లోని హాస్పిటల్లో చేర్పిస్తారు. ఇలా గత నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మందికి పైగా విద్యార్థులకు హెల్త్ కమాండ్ సెంటర్ నుంచే డాక్టర్లు, ఇతర సిబ్బంది వైద్య సేవలందించారు. 43 మంది విద్యార్థులకు సైకలాజికల్ సమస్యలు రాగా, వాళ్లకు కౌన్సెలింగ్ఇచ్చారు. దీంతో గత నెల రోజుల్లో ఇతర గురుకులాలతో పోలిస్తే మైనారిటీ గురుకులాల్లో హెల్త్ఇష్యూస్ తగ్గినట్టు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.
రెండు షిఫ్టుల్లో సేవలు..
స్టూడెంట్స్ హెల్త్ మానిటరింగ్చేయడానికి ఉదయం 9 నుంచి రాత్రి 6, రాత్రి 6 నుంచి ఉదయం 9 వరకు రెండు షిఫ్టుల్లో సిబ్బంది పని చేస్తున్నారు. డే షిఫ్టులో నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇద్దరు ఫుడ్హైజినిస్టులు, ఇద్దరు సైకాలజిస్టులు, ఇద్దరు టెలీ కౌన్సిలర్లు.. నైట్షిఫ్టులో ఇద్దరు ఎంబీబీఎస్డాక్టర్లు, ఇద్దరు టెలీ కౌన్సిలర్లు డ్యూటీ చేస్తున్నారు.
హెల్త్ కమాండ్సెంటర్ నోడల్ఆఫీసర్గా జరీనా ఫాతిమా, ఇన్చార్జ్గా ఇమ్రాన్మొహమ్మద్, క్యూ మేనేజర్లుగా మరియం ఫాతిమా, మెరుగు రాజేంద్రం పని చేస్తున్నారు. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్లు మొహిమున్నా ఫర్దోస్, సమ్రీన్ ఉన్నీసా, అబ్దుల్లా ఖాన్, మొహమ్మద్అయూబ్ బీ, గజాలా తస్రీన్, జురా అబ్దుల్ రహీం, ఫుడ్ హైజినిస్టులు శ్వేత షిండే, రచన, సైకాలజిస్టులు మిర్యాల లావణ్య, సులక్షణ తాడివాక, టెలీ కౌన్సిలర్లుగా మాధవి, రాజేశ్వరి, ఫాతిమా సేవలందిస్తున్నారు.