
నగరి మండలం ధర్మాపురం క్రాస్ దగ్గర చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. .స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై మార్కింగ్ వేస్తున్న వారిని అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. వ్యాన్, బైక్, కార్లకు తృటిలో ప్రమాదం తప్పింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.