యాదగిరి గుట్టకు భక్తుల రద్దీ..దర్శనానికి 2 గంటలు

యాదగిరి గుట్టకు భక్తుల రద్దీ..దర్శనానికి 2 గంటలు

యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు కూడా కావడంతో ఉదయం నుంచే కొండకు క్యూ కట్టారు జనం. స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట టైమ్ పడుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. కొండపై ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. దర్శనం క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, తలనీలాలు సమర్పించే దగ్గర, పుణ్య స్నానాలు చేసే గుండంలో రద్దీ కనిపిస్తోంది. ఇవాల్టి నుంచి కొండ పైకి ఫోర్ వీలర్ వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఒక్కో వాహనానికి గంటకు 500 రూపాయల చార్జ్ వసూలు చేస్తున్నారు. గంట దాటితో మరో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు.