ఇక శ్రీవారి లడ్డూలో అది ఉండదట.. ఏంటంటే..

ఇక శ్రీవారి లడ్డూలో అది ఉండదట.. ఏంటంటే..

 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసారం చాలా ఫేమస్.  శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందని నెయ్యిని వినియోగించరు. దీంతో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించే మరో కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది. తిరుమల లడ్డూ తయారీకి గత 50 ఏళ్లుగా కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్ నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు.  ఇకపై శ్రీవారి లడ్డూ తయారీలో ఈ నెయ్యి వాడకం నిలిచిపోయింది. లడ్డూ తయారీకి పంపే నాణ్యమైన నందిని నెయ్యిని ఇకపై సరఫరా చేయలేమని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు.

 టీటీడీకి నందిని నెయ్యి సరఫరా చేసే విషయంలో కేఎంఎఫ్ చర్చలకు సిద్దం కావడంతో ఈ వ్యవహారం మలుపుతిరుగుతోంది. పోటీ ధరల కారణంగా టీటీడీకి నందిని నెయ్యి సరఫరా చేయలేకపోయిందని... నందిని నెయ్యి నాణ్యమైనదని  కేఎంఎఫ్‌ అధ్యక్షుడు భీమానాయక్‌ అన్నారు.  టీటీడీ ఇతర సంస్థల నెయ్యి వినియోగానికి ప్రాధాన్యత ఇస్తే లడ్డూల నాణ్యత అంతగా ఉండదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు

నందిని పాల ఉత్పత్తుల ధరల పెంపు కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి టెండర్‌ను వేరే కంపెనీకి అప్పగించింది. ఆగస్టు 1 నుంచి పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడంతో నెయ్యి ధరలు కూడా పెరగనున్నాయి. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించేందుకు కొత్త కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసిందన్నారు. అందుకే చాలా ఏళ్ల తర్వాత టీటీడీకి నందిని నెయ్యి సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. నందిని పాల ధర లీటరుకు రూ.3 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.39 ధర ఉండే టోన్డ్ పాలను ఆగస్టు 1 నుంచి లీటరుకు రూ.42కు విక్రయించనున్నారు. మిగతా చోట్ల లీటరుకు రూ.54-రూ.56 మధ్య విక్రయిస్తారు. తమిళనాడులో లీటరు పాల ధర రూ.44గా ఉందని అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.