కేసీఆర్ ​నిర్మించిన డల్లాస్​లో పడవలు ఫేమస్.. : మల్లు రవి

కేసీఆర్ ​నిర్మించిన డల్లాస్​లో పడవలు ఫేమస్.. : మల్లు రవి

హైదరాబాద్ ని  డల్లాస్​ లా మారుస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలకు కౌంటర్​ ఇచ్చారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. కేసీఆర్​నిర్మించిన డల్లాస్​(హైదరాబాద్)లో పడవలు ఫేమస్​ అని.. వర్షాలు పడితే వెహికిల్స్ పడవల్లా మారిపోతాయని ఎద్దేవా చేశారు. 

ఆయన జులై 26న కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లో భారీ వర్షాలకు మునిగిపోయిన ప్రాంతాలను పరిశీలించారు. పలు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

 రూ.లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని బీరాలు పలుకుతున్న మంత్రి కేటీఆర్​కు చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్​ మునిగిపోతుండటం కనిపించట్లేదని విమర్శించారు. చేతగాని వ్యక్తులు ఉన్న మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.  

ఓట్ల కోసం బీఆర్​ఎస్​ నేతలు వచ్చి ఇచ్చే హామీలు తరువాత కనిపించవని అన్నారు. కేసీఆర్​కు వర్షాలతో బాధ పడుతున్న ప్రజల కష్టాలు కనిపించట్లేదని అన్నారు.  లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని డిమాండ్​ చేశారు. ఆయనతో టీపీసీసీ జనరల్​ సెక్రటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి తదితరులు ఉన్నారు.