హైదరాబాద్, వెలుగు: రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రూ.5.50 లక్షల విలువ చేసే బహుమతులు అందించనున్నట్లు మంగళవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చన్నారు.
జర్నీ పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలని కోరారు. వచ్చే నెల 9లోగా లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు.