- ముంపు బాధిత విద్యార్థులకు అండగా నిలిచిన తుమ్మల యుగంధర్
ఖమ్మం రూరల్, వెలుగు : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఖమ్మం రూరల్ జలగం నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ముంపునకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి తుమ్మల స్కూల్ను రూరల్ మండలం ఆరెంపులలోని మహమ్మదీయ కాలేజీ వద్దకు తరలించారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
తుమ్మల యువసేన ఆధ్వర్యంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ తన సొంత ఖర్చుతో స్టూడెంట్స్కు శుక్రవారం నోట్ బుక్స్ అందజేశారు. తుమ్మల యువసేన తరఫున 250 స్కూల్ బ్యాగ్స్ను అందజేసి తల్లిదండ్రులు, టీచర్లతో మాట్లాడి విద్యా ప్రమాణాల పెంపునకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.
