తేనెతుట్టెపై నీళ్లు చల్లిన ఫలితం సందర్శకులపై తేనెటీగల దాడి

తేనెతుట్టెపై నీళ్లు చల్లిన ఫలితం సందర్శకులపై తేనెటీగల దాడి
  •      తీవ్ర గాయాలతో స్పృహ తప్పిన ఇద్దరు సందర్శకులు
  •     రాయికల్​ వాటర్​ ఫాల్​ వద్ద ఘటన 

సైదాపూర్, వెలుగు : కరీంనగర్‌‌ జిల్లా సైదాపూర్​మండలం రాయికల్​జలపాతం దగ్గర ఇద్దరు సందర్శకులు తేనెతుట్టెపై నీళ్లు చల్లడంతో అవి వెంటపడి దాడి చేశాయి. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయారు. కరీంనగర్​కు చెందిన రత్న సంపత్​, మన్నెంపల్లి గ్రామానికి చెందిన బహుత్ ​శ్రీనివాస్​ గురువారం వాటర్​ఫాల్ ​చూసేందుకు వచ్చారు. జెండా గుట్టపై వరకు చేరుకున్న తర్వాత అక్కడ చెట్లపై ఉన్న తేనెతుట్టెపై నీళ్లు చల్లడంతో తేనెటీగలు వెంట పడి దాడి చేశాయి.

 తీవ్రంగా గాయపడిన ఇద్దరు తప్పించుకునే ప్రయత్నంలో పరుగులు తీయగా వాటర్​ఫాల్​ బండలపై జారిపడి స్పృహ తప్పి పడిపోయారు. మధ్యాహ్నం వెళ్లిన వారు ఎంతకూ రాకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో కుటుంబసభ్యులు రాయికల్ గ్రామస్తులను ఆరా తీశారు. గ్రామస్తులు కొందరు గుట్టలపై గాలించగా కనిపించారు. వారిని పోలీసులు హుజూరాబాద్ ​ప్రభుత్వ దవాఖానకు తరలించారు.