చాలామంది తల్లిదండ్రులకు, నానమ్మ తాతయ్యలకు ట్రావెలింగ్ లేదా విదేశీ టూర్లు వేయాలనే కోరిక ఉంటుంది. వాళ్లకోసం టైం కేటాయించి, ఉద్యోగాలకు కొన్ని రోజులు సెలవులు పెడితే బాగుండు అని వాళ్ల మనసులో ఉంటుంది. కానీ, ఆ కోరికలు ప్రతి ఒక్కరికి నెరవేరకపోవచ్చు. అయితే, యూకేకి చెందిన డెంటిస్ట్ డాక్టర్ ఉసామా అహ్మద్ తన అమ్మమ్మ కోరిక నెరవేర్చాడు. అదే విషయం గురించి అహ్మద్ ‘మా అమ్మమ్మ నన్ను బాగా పెంచింది.
అందుకే ఆమె లైఫ్లో లగ్జరీగా ఉండాలని అనుకున్నా. అందుకే ఆమెని తీసుకుని పారిస్ ట్రిప్కి వెళ్లా’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వాళ్లిద్దరూ చేతులు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇలా వాళ్లు పారిస్లో ఎంజాయ్ చేసిన క్షణాలన్నీ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాడు. పది రోజుల కిందట పెట్టిన ఒక వీడియో మిలియన్ల మంది చూడడంతో ఆ పోస్ట్ వైరల్ అయింది కూడా. చూసినవాళ్లంతా అహ్మద్, వాళ్ల అమ్మమ్మ బంధానికి ఫిదా అయిపోతున్నారు. ‘ఇండియాకి రండి, మేం బామ్మని కలవాలనుకుంటున్నాం’, ‘ఈ ప్రపంచంలో డబ్బుతో సహా ఏదీ ఇవ్వలేని సంతోషం ఇది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.