UPSC ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్..ఆగస్టు 22న మెయిన్స్ ఎగ్జామ్

UPSC ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్..ఆగస్టు 22న మెయిన్స్ ఎగ్జామ్

UPSC సివిల్స్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిలిమినరీ ఫలితాలను జూన్ 11న విడుదల చేసింది. సీఎస్ఈ  ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025కు హాజరైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.

ఉత్తీర్ణులైన వారు మెయిన్స్ కు..

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ 2025 ఆగస్టు 22న జరగనుంది.మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. మెయిన్స్ లో ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా తుది మెరిట్ జాబితాను UPSC లిస్ట్ అవుట్ చేస్తుంది. 

మే 25, 2025న యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025ను నిర్వహించారు. రెండు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎగ్జామ్ లో గరిష్టంగా 200 మార్కులకు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో మూడింట ఒక వంతు మినహాయించబడుతుంది.

979 పోస్టుల భర్తీకి..

పరీక్ష ద్వారా మొత్తం 979 ఖాళీలను భర్తీ చేసేందుకు కమిషన్ సివిల్స్ పరీక్ష 2025 ను నిర్వహిస్తోంది. వీటిలో డిసెబిలిటీ కేటగిరీ అభ్యర్థులకు 38 ఖాళీలను కేటాయించారు. అంధత్వం ,తక్కువ దృష్టి ఉన్నవారికి 12, చెవిటి ,వినికిడి లోపం ఉన్నవారికి 7, లోకోమోటర్ వైకల్యం ఉన్నవారికి 10, చెవిటి-అంధత్వంతో సహా వైకల్యం ఉన్నవారికి 9 ఖాళీలను కేటాయించారు.