వాటర్​ వర్క్స్​, ​​డ్రైనేజీకి రూ.400 కోట్లు : ఎమ్మెల్యే ధన్​పాల్​

వాటర్​ వర్క్స్​, ​​డ్రైనేజీకి రూ.400 కోట్లు : ఎమ్మెల్యే ధన్​పాల్​
  • అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ 

నిజామాబాద్, వెలుగు: నగర పాలక సంస్థ పరిధిలో అమృత్​ 0.2 కింద అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, వాటర్​ సప్లయ్​కోసం రూ.400 కోట్ల నిధులు మంజూరయ్యాయని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన గంగాస్థాన్ ఫేజ్​-1లో  పనులను పరిశీలించి మాట్లాడారు. 

 మొత్తం 150 మ్యాన్​ హోల్స్​ రిపేర్​ చేసి కొత్తగా 45 నిర్మించామన్నారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పనుల్లో స్పీడ్ పెంచాలని సూచించారు. ఏడాదిన్నర కాలంలో ప్రతి ఇంటికీ డ్రైనేజ్ కనెక్షన్​ ఇస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట డీఈ నగేశ్​రెడ్డి, బీజేపీ జిల్లా వైస్​ ప్రెసిడెంట్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఆనంద్​రావు, సాయి ప్రవీణ్​, పవన్ తదితరులు ఉన్నారు.