
వైరా,వెలుగు: వైరా ఎస్ఐ పుష్పాల రామారావు చొరవతో ఆరుగురు దివ్యాంగులకు ఉచితంగా అధునాతన కృత్రిమ కాళ్లు అందాయి. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సౌజన్యంతో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆరుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందజేశారు. క్యాంపు నిర్వాహకులతో ఎస్ఐ రామారావు మాట్లాడి దివ్యాంగులకు సహాయం చేశారు. కృత్రిమ కాళ్లు ఉచితంగా అందుకున్న దివ్యాంగులు వారి కుటుంబీకులు ఎస్ఐ రామారావుకు క్యాంపు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.