
తొర్రూరు, వెలుగు: ఆర్టీసీ అందిస్తున్న మెరుగైన సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. శనివారం తొర్రూరు ఆర్టీసీ డిపో పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు రాజధాని ఏసీ బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు తొర్రూరు వయా తిరుమలగిరి, మోత్కూరు మీదుగా హైదరాబాద్ పట్టణానికి సర్వీసులు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అంతకుముందు హరిపిరాల గ్రామంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి రాష్ర్ట ముదిరాజ్కార్పొరేషన్ చైర్మన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం పాలకుర్తి ఇన్చార్జి బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, పార్టీ పట్టణాధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.