ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదు : ఎంపీ సంచలన కామెంట్స్

ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదు : ఎంపీ సంచలన కామెంట్స్

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నిన్నటికి నిన్న పార్టీ శ్రేణులకు షాకిస్తూ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఈ రోజు (మే31) కీలక కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పిట్టల దొరకు సీటిచ్చినా తనకు ఎలాంటి  ఇబ్బంది లేదని కేశినేని నాని అన్నారు. తనకు  పార్టీ  టికెట్ ఇస్తుందా.. తాను ఎంపీ ని అవుతానా లేదా అనే భయం లేదన్నారు కేశినేని.   తనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్న ఆయన... తనకు టికెట్ ఇవ్వకున్నా  ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీనవుతానన్నారు. తన మనస్తత్వానికి నచ్చిన పార్టీ నుంచే పోటీచేస్తానని తెలిపారు.   బెజవాడ పార్లమెంట్ కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తా అన్నారు.వెనుక బడిన బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసమే పని చేస్తాను.. నా శ్వాస, నా ఊపిరి అన్నీ బెజవాడ పార్లమెంట్ కోసమే ఉంటుందని వ్యాఖ్యానించారు ఎంపీ కేశినేని నాని.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తర్వాత కేవలం అభివృద్ధి మాత్రమే అన్నారు నాని.. ఒక పార్టీ ఎంపీ, మరో పార్టీ ఎమ్మెల్యే అభివృద్ది కోసం పని చేస్తే తప్పా అని ప్రశ్నించారు.. పదేళ్లు నేను చేసిన పని దేశంలో ఎవరు చేశారో చూపండి అంటూ చాలెంజ్ చేశారు. నాకు ట్రాక్ రికార్డ్ ఉంది.. ఐ యామ్ ప్రూవ్డ్ అన్నారు.. ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఏదైనా చేయిస్తా.. పార్టీ ఐడియాలజీ కోసం ఫైట్ చేయాలి కానీ, ఈ పిచ్చి గోల ఏంటి? అని అసహనం వ్యక్తం చేశారు.. ఇవి పొలిటికల్ పార్టీలు కాదు రెండు వేదికలు మాత్రమే.. ఒక వేదిక మాది చంద్రబాబు నాయకుడు, మరో వేదిక వైసీపీ జగన్ నాయకుడు అని స్పష్టం చేశారు. జగన్, చంద్రబాబు విరోదంగా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళెవరూ విరోధులు కాదన్న ఆయన.. నేను ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల కోసమే పనిచేస్తా అన్నారు.. నా మైండ్ సెట్ కలిసే వ్యక్తులతో కలిసి పనిచేయడానికి నాకు ఏ పార్టీ ఐనా అనవసరం అని కుండబద్ధలు కొట్టారు కేశినేని నాని.