న్యూఢిల్లీ: విన్సిస్ ఐటి సర్వీసెస్ ఇండియా, ఒరియానా పవర్.. ఈ రెండు ఎస్ఎంఈ ఐపిఓలు వచ్చే నెల ఒకటో తేదీన ప్రారంభం కానున్నాయి. ఇవి ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫారమ్లో లిస్ట్ అవుతాయి. పూణేకు చెందిన విన్సిస్ ఐటీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్.. ఐటీ, సాఫ్ట్వేర్ సేవల సంస్థ. ఇది ఐపీఓ ధరను రూ.121–128 మధ్య నిర్ణయించింది. ఇష్యూ ఆగస్టు 4, 2023న ముగుస్తుంది. బుక్ -బిల్డింగ్ విధానంలో 38.9 లక్షల ఈక్విటీ షేర్లను అందించనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ రూ.49.84 కోట్లు సమీకరించనుంది.
కనీస అప్లికేషన్ లాట్ పరిమాణం వెయ్యి షేర్లు.ఒరియానా పవర్ ఐపీఓ నోయిడాకు చెందిన ఒరియానా పవర్ లిమిటెడ్ ఐపీఓ ఆగస్టు 1, 2023న సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది. ఆగస్టు 3న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ రూ. 115–118 మధ్య ప్రకటించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 59.64 కోట్లు సేకరించనుంది. బుక్- బిల్డింగ్ రూట్ ద్వారా 50.55 లక్షల ఈక్విటీ షేర్లను అమ్ముతుంది. ఇది కూడా ఎన్ఎస్ఈ ఎమర్జ్లో లిస్ట్ అవుతుంది. కార్పొరేట్ క్యాపిటల్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి లీడ్ మేనేజర్ కాగా, స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి రిజిస్ట్రార్.