కాల్పోల్ విలేజ్లో మెడికల్ క్యాంప్

కాల్పోల్ విలేజ్లో మెడికల్ క్యాంప్

నిజామాబాద్​, వెలుగు: నగర శివారులోని మోపాల్​ మండలం కాల్​పోల్​ తండాలో  వైరల్​ జ్వరాల వ్యాప్తి కలకలం రేపింది.  ప్లేట్​లెట్స్​ తగ్గి 13 మంది గిరిజనులు ప్రైవేట్​ హాస్పిటల్స్​లో చేరిన సమాచారం తెలిసి ప్రభుత్వ మెడికల్​ ఆఫీసర్స్​ అలర్ట్​ అయ్యారు.  కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్​వో రాజశ్రీ నేతృత్వంలో శనివారం తండాలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

తండాలో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. 152 మందికి ఆర్​డీటీ నిర్వహించి ఏడుగురు బ్లడ్​ శాంపిళ్లను సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్​ హబ్​కు పంపారు. ఇండ్ల పరిసరాల్లో దోమల వ్యాప్తిని అరికట్టే యాంటీ లార్వల్​ చర్యలు తీసుకున్నారు. మలేరియా ఆఫీసర్​ డాక్టర్​ తుకారాం రాథోడ్, సర్వేలెన్స్​ ఆఫీసర్​ డాక్టర్​ నాగరాజ్,​ ఎపిడమాలజిస్టు డాక్టర్​ వెంకటేశ్,​​ డాక్టర్​ అజ్మల్​, డాక్టర్​ ప్రత్యూష, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.