బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు వర్షంలో తడుస్తూనే నిరసన వ్యక్తం చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వివేక్ ట్వీట్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన నిరసనకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తమకు కనీస వసతులు కల్పించి శాశ్వత వైస్ ఛాన్స్లర్ ను నియమించాలని విద్యార్థులు చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బాసర IIITలో విద్యార్థులంతా వర్షంలో తడుస్తూనే కదలకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు,ఐనా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. కనీస వసతులు కల్పించి శాశ్వత VCని నియమించాలని విద్యార్థులు చేస్తున్న నిరసనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. pic.twitter.com/riquTLMdzO
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) June 16, 2022