ఆవిర్భావ ఏర్పాట్లు పకడ్బందీ ఉండాలి

ఆవిర్భావ ఏర్పాట్లు పకడ్బందీ ఉండాలి

గ్రేటర్​ వరంగల్, వెలుగు: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా ఉండాలని వరంగల్ కలెక్టర్​ సత్య శారదాదేవి ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం ఖిలా వరంగల్​లోని ఖుష్​మహాల్​మైదానంలో ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఆమె జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. 

అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, తగు సూచనలు చేశారు. కలెక్టర్​ మాట్లాడుతూ జాతీయ పతాకం ఎగురవేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ముఖ్య​అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో సిటీ డిప్యూటీ పోలీస్​ కమిషనర్​ అంకిత్​ కుమార్, ​అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రామిరెడ్డి, గృహ నిర్మాణాల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్​ గణపతి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి తదితరులున్నారు.