
గ్రేటర్ వరంగల్, వెలుగు: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం ఖిలా వరంగల్లోని ఖుష్మహాల్మైదానంలో ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఆమె జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.
అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, తగు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పతాకం ఎగురవేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో సిటీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అంకిత్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రామిరెడ్డి, గృహ నిర్మాణాల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి తదితరులున్నారు.