గ్రేటర్ వరంగల్/ కాశీబుగ్గ, వెలుగు: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా నార్కోటిక్ కమిటీ మీగింగ్లో కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా నియంత్రణ నివారణపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో, కాలేజీల ప్రాంగణంలో విద్యార్థులకు మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలని పోలీస్ ఆఫీసర్లను ఆదేశించారు.
కార్యక్రమంలో ఏసీపీలు శుభం, రవీందర్ రెడ్డి, నరసయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీలోని పోతన ఆడిటోరియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో భాగంగా వివేకానందుడి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పోటీల్లో గెలుపొందిన వారిని అభినందించి, బహుమతులను అందజేశారు. వివేకానందుడి స్ఫూర్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.
