కుటుంబ కలహాలతో ఎస్సై సూసైడ్

కుటుంబ కలహాలతో ఎస్సై సూసైడ్

నర్సంపేట, వెలుగు: కుటుంబ కలహాలతో వరంగల్​ జిల్లాకు చెందిన ఎస్బీ ఎస్సై ఎండీ ఆసీఫ్(60) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసీఫ్​ ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో ఎస్బీ ఎస్సైగా పని చేస్తున్నాడు.

 నర్సంపేటలోని మల్లంపల్లి రోడ్​కు చెందిన ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగగా, ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. ట్రీట్​మెంట్​ పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. ఆసీఫ్​ మృతితో పోలీసుశాఖతో పాటు నర్సంపేట పట్టణంలో విషాదం నెలకొంది.