ప్రగతిభవన్ను బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తాం : రేవంత్ రెడ్డి

ప్రగతిభవన్ను  బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తాం :  రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ను  బాబాసాహెబ్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తామని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గడీల పాలనకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమేనని చెప్పారు. ఉద్యమకారులకు, సామాన్య ప్రజలకు ఎంట్రీ లేనప్పుడు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడితే తప్పేంటని రేవంత్ ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెడితే భయపడే వ్యక్తిని కాదన్న ఆయన.. కార్యకర్తల త్యాగం ముందు తన త్యాగం ఎంతన్నారు. తన పాదయాత్రలో వ్యూహాత్మకంగా పోలీసు బందోబస్తు తగ్గించారని రేవంత్ ఆరోపించారు. 

రాబోయే 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్ లను  జైలుకు పంపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పారు. ధరణి కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయిందని ఆరోపించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ , మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పార్టీ పిరాయింపులకు మియాపూర్ భూములే కారణమన్నారు.  అసెంబ్లీ మొత్తం కేసీఆర్ భజన మండలిగా మారిందని రేవంత్ విమర్శించారు.