విదేశాల్లో చదవలేననే మనస్తాపంతో యువతి సూసైడ్ 

విదేశాల్లో చదవలేననే మనస్తాపంతో యువతి సూసైడ్ 

ఎల్ బీ నగర్, వెలుగు: లాక్ డౌన్ తో హయ్యర్ స్టడీస్​కు విదేశాలకు వెళ్లలేననే మనస్తాపంతో యువతి సూసైడ్ చేసుకున్న ఘటన ఎల్ బీనగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఎల్ బీనగర్ లోని సౌభాగ్యపురం కాలనీకి చెందిన కోడిగండి స్పందన (28) ఐదేండ్లు ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది. కొంతకాలం కిందట జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటోంది. స్పందనకు ఫారిన్ స్టడీస్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో యూఎస్, జర్మనీ లో చదివేందుకు అప్లయ్ చేసింది. ఆమెకు అడ్మిషన్ ఆఫర్లు కూడా వచ్చాయి. లాక్ డౌన్ తో ఫారిన్ లో ఉన్నత చదువుల కోసం వచ్చిన అడ్మిషన్ కు తాను అటెండ్ కాలేననే మనస్తాపంతో శుక్రవారం స్పందన ఇంట్లో ఉరేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.