అప్పుల బాధతో మహిళా రైతు సూసైడ్

అప్పుల బాధతో మహిళా రైతు సూసైడ్

మరిపెడ, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.  స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మరిపెడ మండలంలోని వీరారం బొత్తల తండాకు చెందిన మహిళా రైతు వాంకుడోత్ విజయ(45) , వ్యవసాయ పెట్టుబడి ఖర్చులకు అప్పులు చేసింది.

 కొంతకాలంగా ఎలా తీర్చాలోనంటూ తీవ్ర మనస్తాపానికి లోనైంది. బుధవారం తన ఇంట్లోనే ఆమె ఉరేసుకుని చనిపోయింది. సమాచారం అందడంతో మరిపెడ పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.