
తంగళ్లపల్లి, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీలో తమ పేరు రాలేదని ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో గతంలో 27 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంచలేదు.
కాగా ఇటీవల వాటికి సంబంధించిన లిస్ట్ విడుదల చేశారు. దీనిపై గ్రామానికి చెందిన భరన్అనే యువకుడు తనకు ఇల్లు రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటానని పురుగుమందు డబ్బా పట్టుకొని కుటుంబసభ్యులకు వీడియో కాల్చేశాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు భరన్ దగ్గరికి వెళ్లి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. కాగా తనకు ఇల్లు రాకపోవడానికి ఓ కాంగ్రెస్ నేత కారణమని యువకుడు ఆరోపించాడు.