ఫ్యూయెల్​ స్టేషన్లలోనే ఈ ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు

ఫ్యూయెల్​ స్టేషన్లలోనే ఈ ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు

బెంగళూరు : దేశంలో 10 వేల ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎనర్జీ కంపెనీ షెల్​ ప్లాన్​ చేస్తోంది. 2030 నాటికల్లా వాటిని పెట్టాలని చూస్తోంది. బెంగళూరులో మొట్టమొదటి ఈవీ ఛార్జింగ్​ స్టేషన్​ను గురువారం నాడు షెల్​ ప్రారంభించింది. ఈ ఈవీ స్టేషన్​లో టూ వీలర్లు, కార్లు ఛార్జ్​ చేసుకునే వీలుంటుంది. టూ వీలర్ల కోసం మొదటగా ఇండియా మార్కెట్లోనే ఛార్జర్లను తెచ్చినట్లు ఈ సందర్భంగా షెల్​ ప్రకటించింది. తమ కస్టమర్లకు  సేఫ్​,  గ్రీన్​, ఇంటిగ్రేటెడ్​ మొబిలిటీ సొల్యూషన్లు అందించాలనే టార్గెట్​ పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

షెల్​ రీ ఛార్జ్​ స్టేషన్లను ఆ విధంగానే ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఫస్ట్​ఫేజ్​ కింద  బెంగళూరులోని తన ఫ్యూయెల్​ స్టేషన్లలోనే ఈ ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లను కూడా షెల్​ ఏర్పాటు చేస్తోంది. యశ్వంత్​పూర్​, ఓల్డ్​ మద్రాస్​ రోడ్​, బ్రూక్​ ఫీల్డ్​, కనకపురలలో ఛార్జింగ్​ స్టేషన్లను పెడుతున్నామని వివరించింది. తమకు రిటెయిల్​ బిజినెస్​ ఉన్న కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్​, తెలంగాణ, అసోం, ఆంధ్ర ప్రదేశ్​ రాష్ట్రాలలోనే ఎలక్ట్రిక్​ వెహికల్​ ఛార్జింగ్​ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు షెల్​ వెల్లడించింది.