ఏపీలో కొత్తగా 10,199 కేసులు..75 మంది మృతి

ఏపీలో కొత్తగా 10,199 కేసులు..75 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది వైద్యారోగ్యశాఖ. వైరస్ తో కొత్తగా 75 మంది చనిపోగా .. గడిచిన 24 గంటల్లో 9,499 మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పింది.

కొత్త కేసులతో కలిపి ఏపీలో 4 లక్షల 65 వేల 730కి కరోనా కేసులు చేరాయని.. ఇప్పటివరకు 4200 మంది కరోనాతో మరణించారని వెల్లడించింది. ప్రస్తుతం లక్షా 3 వేల 701 యాక్టివ్ కేసులుండగా..3 లక్షల 57 వేల 829 మంది రికవరీ అయ్యారని.. ఏపీలో ఇప్పటి వరకు 39 లక్షల 5 వేల 775 కరోనా టెస్ట్‌లు చేశారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.