మున్నేరు నదిపై ఆనకట్టకురూ.107 కోట్లు

మున్నేరు నదిపై ఆనకట్టకురూ.107 కోట్లు
  •  నిధులు విడుదల చేస్తూజీవోలు ఇచ్చిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: వివిధ లిఫ్ట్​ఇరిగేషన్​ స్కీములు, చెక్​ డ్యాముల నిర్మాణాలు, పెండింగ్​పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు గురు వారం ఉత్తర్వులను జారీ చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పండ్రేగుపల్లి గ్రామంలో మున్నేరు నదిపై ఆనకట్ట నిర్మాణానికి రూ.107.3 కోట్లు శాంక్షన్​ చేసింది. అదే జిల్లా రఘునాథపాలెం మండలంలోని వెలుగుమట్లలో నాగార్జునసాగర్​ లెఫ్ట్​ కెనాల్​రైట్ బ్యాంక్ ​వద్ద తలపెట్టిన కొడుమూరు వం దనం లిఫ్ట్​ఇరిగేషన్ ​స్కీమ్ ఫేజ్ 2 పనులకు రూ.35.75 కోట్లను మంజూరు చేసింది. కరీంనగర్​ జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో కలు వలవాగు వద్ద చెక్​డ్యామ్​ నిర్మాణానికి రూ.3.63 కోట్లను మంజూరు చేసింది.