‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ మరో మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘వీర సింహారెడ్డి’. టీజర్తో పాటు బాలయ్య లుక్, డైలాగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిన్న, పెద్ద కలిపి మొత్తం పదకొండు ఫైట్ సీన్స్ ఉంటాయని, అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల అనంతపురంలో యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆమెకున్న బిజీ షెడ్యూల్ కారణంగా తన కాంబినేషన్ సీన్స్ ముందుగానే షూట్ చేసేశారు. లాస్ట్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. దీనికోసం డిసెంబర్ 18 నుంచి శ్రుతి డేట్స్ కేటాయించిందని తెలుస్తోంది. ఇయర్ ఎండింగ్లోపు షూటింగ్తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించనున్నారు బాలకృష్ణ. ఇందులో విలన్ పాత్రకోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ను తీసుకున్నట్టు తెలుస్తోంది. షైన్ స్ర్కీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.