ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది విద్యార్థుల రాక

ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది విద్యార్థుల రాక

న్యూఢిల్లీ: ఇరాన్  నుంచి  110 మంది భారతీయ విద్యార్థులు గురువారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఆ రెండు దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ను ప్రారంభించింది. 

ఇందులో భాగంగా ఇరాన్ నుంచి ఇండియన్ స్టూడెంట్లను అర్మేనియా, దోహా మీదుగా ఢిల్లీకి తీసుకొచ్చారు. వీరిలో జమ్మూకాశ్మీర్ కు చెందిన స్టూడెంట్లు 90 మంది ఉన్నారు. కాగా, ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు సైతం పెరుగుతుండటంతో అక్కడి స్టూడెంట్లను కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టెల్ అవీవ్ లోని ఇండియన్ ఎంబసీ కూడా ప్రకటించింది.