కరోనాను జయించిన 110ఏళ్ల రామానంద

కరోనాను జయించిన 110ఏళ్ల రామానంద


హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఓ శుభవార్త. మన తెలంగాణ గడ్డలో 110 ఏళ్ల వ్యక్తి కరోనాను జయించాడు. అది కూడా హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న గాంధీ ఆస్పత్రిలో. కరోనా పేరెత్తితేనే భయంతో వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామానంద అనే 110 ఏళ్ల వ్యక్తి  కరోనాను జయించడం కొండంత ఉపశమనం కలిగిస్తోంది. 
దేశంలోనే అతిపెద్ద వయసు గల వ్యక్తి కరోనాను జయించాడని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజా రావు ప్రకటన విడుదల చేశారు.