- గ్రేటర్ లో ఇప్పటికే 404 సిగ్నల్స్
- ఇందులో 169 పాత సిగ్నల్స్ అప్డేట్ చేయనున్న బల్దియా
- పాదాచారుల భద్రతకు 78 పెలికాన్ సిగ్నల్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్సమస్య తలెత్తడానికి సిగ్నల్స్లేకపోవడమూ కారణమవుతోంది. దీన్ని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో కొత్త సిగ్నల్స్ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో మూడు కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే జంక్షన్లను గుర్తించిన జీహెచ్ఎంసీ రూ.71 కోట్లతో కొత్తగా113 కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అలాగే, మరిన్ని ప్రాంతాలను గుర్తించే పనిలో పడింది. సిటీలో ఇప్పటికే 404 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండగా, ఇందులో 169 సిగ్నల్స్ పాతవి కావడంతో వాటిని ఏటీఎస్ సీ (అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్)గా మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్నింటిని అప్డేట్చేశారు. వాహనాల రద్దీని గుర్తించే సెన్సార్లను బిగించడం వల్ల అవి సిగ్నల్ టైమింగ్ను అవసరానికి అనుగుణంగా ఆటోమెటిక్గా మారుస్తాయి. దీనివల్ల ట్రాఫిక్ఎక్కువగా ఉండే రూట్కు ఎక్కువ సెకన్లు..తక్కువగా ఉండే రూట్లో తక్కువ సెకన్లు వచ్చేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
పాదచారుల కోసం ..
పాదాచారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ 78 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సిగ్నల్స్దగ్గర ఉండే బటన్లను నొక్కడం ద్వారా వాహనాలకు రెడ్సిగ్నల్పడుతుంది. దీనివల్ల పాదచారులు ఎప్పుడంటే అప్పుడు ఇబ్బంది లేకుండా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిమ్స్హాస్పిటల్ వంటి ప్రాంతాల్లో ఇటువంటి సిగ్నల్స్ఉన్నా అవగాహన లేక పాదచారులు వీటిని
వాడలేకపోతున్నారు.
