
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షల 53వేల 171కి చేరగా..మృతుల సంఖ్య లక్షా 14 వేల 247కి చేరింది. 4,23,625 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక అత్యధికంగా అమెరికాలో 5లక్షల 60వేల 433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్పెయిన్ లో 1,66,831, ఇటలీలో 1,56,363, ఫ్రాన్స్ 1,32,591, జెర్మనీ 1,27,854, యూకే 84,279, చైనాలో 82,160 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో అత్యధికంగా 22,115 మంది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత ఇటలీ 19,899, స్పెయిన్ 17,209, ఫ్రాన్స్14,393, యూకే 10,612, ఇరాన్ 4,474, బెల్జీలియంలో 3,600 మంది కరోనాతో చనిపోయారు. ఇక ఇండియాలో. 9222 కరోనా కేసులు నమోదవ్వగా 331 మంది చనిపోయారు.