
వరంగల్ క్రైం, వెలుగు: తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ కమిషనరేట్ లో 12 మంది పోలీస్ ఆఫీసర్లకు సేవా పతకాలు ప్రకటించారు. హనుమకొండ పీఎస్ లో పని చేస్తున్న ఏఎస్సై ఏ.రఘుమారెడ్డి ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు.
వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ, సీసీఆర్ బీ ఎస్సై విల్సన్, సుబేదారి ఏఎస్సై ప్రకాశ్రెడ్డి, వరంగల్ సీఏఆర్ వింగ్కు చెందిన ఏఆర్ఎస్సైలు మక్బూల్ పాషా, ఎం.రందాన్, షేక్ పాషా, ఎండీ ఖాజా నిజామొద్దీన్, హెడ్ కానిస్టేబుల్ బుస్సు భీమయ్య, కాజీపేట ఏఎస్సై వి.చంద్రమౌళి, మామునూరు పీఎస్వర్టికల్స్ హెడ్ కానిస్టేబుల్ బి.రమేశ్, వంగర వర్టకల్స్ కానిస్టేబుల్ కె.తిరుపతి సేవా పతకానికి అందుకోనున్నారు.