
కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లేటెస్టుగా ఢిలీల్లో 122 మంది CRPF సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరంతా కూడా 31వ బెటాలియన్ కు చెందినవారు. మరో 100 మందికి సంబంధించిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే.. పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మందికి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. కరోనా బారిన పడిన వారిని మండోలిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సెలవులపై ఊరికి వెళ్లొచ్చిన ఓ కానిస్టేబుల్ తో బెటాలియన్ లోని మిగతా వారికి వైరస్ సోకిందని భావిస్తున్నారు. కరోనా కారణంగా బెటాలియన్ ప్రాంతాన్ని నిర్బంధంలో ఉంచారు.