నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గాలిదుమారానికి విరిగిపడ్డ 123 కరెంట్ పోల్స్ 

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గాలిదుమారానికి విరిగిపడ్డ 123 కరెంట్ పోల్స్ 

నిజామాబాద్​, వెలుగు : జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి గాలిదుమారం, వర్షానికి పలు చోట్ల చెట్లు, విద్యుత్​ స్తంభాలు కూలాయి.  ఆర్మూర్​ రోడ్​లో రోడ్డుకు అడ్డంగా భారీ చెట్టు కూలగా ట్రాఫిక్​ ఇబ్బందిని తొలగించడానికి సీపీ సాయిచైతన్య స్వయంగా వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 123 కరెంట్​ స్తంభాలు విరిగిపోగా, 3 చోట్ల ట్రాన్స్​ఫార్మర్లు పడిపోయి కరెంట్​ సరఫరా నిలిచిపోయింది.

 బోర్గాం సబ్ స్టేషన్ పరిధిలోని మైసమ్మ గుడివద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టుపడిపోయి కరెంట్​ వైర్లు తెగాయి. దగ్గర్లోనే 33/11 లైన్​ ఉండడంతో అటుగా వెళ్లడానికి జనం భయపడ్డారు. విషయం సబ్​ స్టేషన్​ ఏఈ, లైన్​మెన్​కు తెలపడానికి కాలనీవాసులు ఎన్నిసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్​ చేయలేదు.