వికారాబాద్ జిల్లాలో ప్రజావాణికి 125 అర్జీలు

వికారాబాద్ జిల్లాలో ప్రజావాణికి 125 అర్జీలు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 125 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసిన ఆయన.. వాటిని తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ నారాయణ అమిత్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.