తెలంగాణలో 1,280 కేసులు.. 15 మంది మృతి

తెలంగాణలో 1,280 కేసులు.. 15 మంది మృతి

హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. వైరస్ తో 15 మంది చనిపోయారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్‌ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారని.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 6,03,369కి పెరిగాయని చెప్పింది. ఇవాళ్టి వరకు మొత్తం 5,78,748 మంది కోలుకొని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారని.. ఇంకా 21,137 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. ప్రస్తుతం మొత్తం మరణాలు 3,484కు చేరాయని.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 91,621 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో తెలిపింది.