
- శివసాయి ఇండస్ట్రీస్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు
జైపూర్, వెలుగు : సీఎంఆర్ బియ్యం సర్కారుకు అందజేయని మంచిర్యాల జిల్లా జైపూర్లోని శివసాయి ఇండస్ట్రీస్కు చెందిన రైస్మిల్ను సీజ్ చేసి, యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జైపూర్ మండలంలోని ఇందారంలో ఉన్న శివసాయి ఇండస్ట్రీస్ రైస్మిల్ను మంచిర్యాల సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు ఇటీవలే తనిఖీ చేశారు.
మిల్లు నుంచి ప్రభుత్వానికి అందజేయాల్సిన 2022–-23, 2023–-24 సంవత్సరాలకు సంబంధించిన రూ1.29 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. సివిల్ సప్లయీస్ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు ఆ రైస్మిల్ను సీజ్ చేసి, యజమాని గుంత రవికుమార్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.