కామారెడ్డి ఆత్మహత్య కేసు నిందితులకు రిమాండ్

కామారెడ్డి ఆత్మహత్య కేసు నిందితులకు రిమాండ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు అడిషనల్ సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల కస్టడీ విధించారు. దీంతో నిందితులు పల్లె జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి, ఐరేని పృథ్వీ గౌడ్, తోట కిరణ్, కన్నపురం కృష్ణ గౌడ్, సరాప్  స్వరాజ్లను నిజమాబాద్ జిల్లా జైలుకు తరలించారు. 

ఈ నెల 16న కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఓ లాడ్జిలో తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. వ్యక్తిగత విషయాలను అడ్డం పెట్టుకుని తమను ఏడుగురు వ్యక్తులు వేధిస్తున్నారని తమ మృతికి ఏడుగురు వ్యక్తులు కారణమంటూ తల్లి, కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన వారు మెదక్ జిల్లా రామాయంపేట చెందిన తల్లి గంగు పద్మ, కుమారుడు గంగు సంతోష్(35) గా గుర్తించారు.