రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్లు.. జూన్ 28న ప్రారంభించనున్న మంత్రి జూపల్లి

రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్లు.. జూన్ 28న ప్రారంభించనున్న మంత్రి జూపల్లి

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్రంలో  కొత్తగా14  ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లలో12, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్లలో ఒక్కొక్క ప్రొహిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లను జూన్​ 28న మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రారంభించనున్నారు.  కొత్త స్టేషన్లకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలుగా ప్రస్తుత  ఇన్ చార్జులే విధుల్లో ఉంటారని ఎక్సైజ్​శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  కొత్తగా ఏర్పాటు కానున్న ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లకు కేటాయించిన ప్రాంతాలకు సంబంధించిన కేసుల రికార్డులు, స్వాధీనం చేసుకున్న గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాహనాలు, బెల్లాన్ని కొత్త ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల పరిధిలో నిల్వ చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది.